కోలివుడ్ కి చెందిన కొన్ని తమిళ పత్రికలు రజిని కాంత్ కూతుళ్ళు అయిన ఐశ్వర్య మరియు సౌందర్య ల మధ్య లేని విరోధాన్ని సృష్టిస్తున్నాయి. కాని వారి మధ్య ఎటువంటి గొడవలు లేవు. ఈ విషయమై రజిని కాంత్ పెద్ద కూతురు మరియు ధనుష్ భార్య అయిన ఐశ్వర్య మాట్లాడుతూ “ఇలాంటి వార్తలు మొదటి పేజి లో ఎలా వేస్తారో నాకు అర్ధం కాట్లేదు అసలు ఇలాంటి వార్తలను ఎవరు సృష్టిస్తారో కూడా తెలియట్లేదు. మేము ఎప్పుడు అందుబాటులో నే వుంటాం ఒక్క ఫోన్ చేసి అడిగిన మొత్తం విషయం చెప్తాం ఇలాంటి లేని విషయాలను సృష్టించి ఏం సాదిస్తారో ఇలా ప్రచురించడాన్ని నీతిలేని జర్నలిజం అంటారు. ఇదంతా రజిని కాంత్ గారి పేరుని ఉపయోగించుకొని ప్రజలను వారి వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నమే” అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య ధనూష్ “3” చిత్రం కోసం వేచి చూస్తుండగా సౌందర్య “సుల్తాన్” చిత్ర పనులలో బిజీ గా ఉన్నారు.