మంచు లక్ష్మి క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్!

మంచు లక్ష్మి క్రైమ్ థ్రిల్లర్ ‘దక్ష’ ఓటిటి రిలీజ్ డేట్ లాక్!

Published on Oct 15, 2025 3:11 PM IST

Daksha

మంచు లక్ష్మి రీసెంట్ గా నటించిన చిత్రాల్లో ఒకటే “దక్ష”. మంచు లక్ష్మి సహా చిత్ర శుక్ల కూడా ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించగా మంచు మోహన్ బాబు ఇంకా సముద్రఖని లాంటి వెర్సటైల్ నటులు నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు కానీ ఇపుడు ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

మరి ఈ సినిమా ఓటిటి హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో దక్ష చిత్రాన్ని అప్పుడు మిస్ అయ్యి చూడాలి అనుకునేవారు ఓటిటిలో ఆరోజు వరకు ఆగాలి. ఇక ఈ చిత్రానికి మంచు వారి చాలా సినిమాలకే సంగీతం అందించిన అచ్చు సంగీతం అందించగా మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి నిర్మాణం వహించారు.

తాజా వార్తలు