ప్రముఖ తమిళ హీరో విశాల్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడు విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి విశాల్ ప్రత్యేక అతిథిగా వెళ్లారు. ఈ క్రమంలో వేదికపై ఉండగా ఒక్కసారిగా ఆయన స్పృహ తప్పి పడిపోయారు. దీంతో అందరూ షాక్ కి గురి అయ్యారు. అసలు విశాల్ కి ఏమైంది ? అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లోపే విశాల్ ను ఆసుపత్రికి తరలించారు. ఇంతకి, విల్లుపురంలో జరిగిన ఈవెంట్లో విశాల్ స్పృహ తప్పి పడిపోవడం వెనుక కారణం ఏమిటి ? అంటూ నెటిజన్లు కూడా ఆరా తీస్తున్నారు. గతంలోనూ విశాల్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే.
దీంతో, విశాల్ కి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ? అని ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తాజాగా విశాల్ మేనేజర్ తమ హీరో ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చారు. విశాల్ గారు మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే ఆయన అస్వస్థతకు గురైనట్లు మేనేజర్ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని సమయానికి ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు మేనేజర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి విశాల్ ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.