హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధధూన్’ను తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమేక్ కానుంది. తెలుగులో నితిన్ లీడ్ రోల్ చేస్తుంటే తమిళంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించనున్నారు. అలాగే కథలో ప్రధానమైన నెగెటివ్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ను తీసుకునే ప్రయత్నంలో ఉన్నారట నిర్మాత. ఒరిజినల్ వెర్షన్లో టబు ఈ పాత్ర చేయగా ఆమెకు చాలా మంచి పేరోచ్చింది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడం, ముఖ్యమైన క్యారెక్టర్ కావడంతో ఐశ్వర్యరాయ్ కోసం ట్రై చేస్తున్నారట.
ఐశ్వర్య నటిస్తే సినిమాకు బోలెడంత గ్లామర్ అప్పీల్ వస్తుందని, హైప్ పెరుగుతుందని నిర్మాత ఆలోచన. అయితే ఇంకా ఐశ్వర్యరాయ్తో చర్చలు నడుస్తున్నాయని, ఆమె ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. ఇకపోతే గతంలో ఐశ్వర్యారాయ్, ప్రశాంత్ కలిసి ‘జీన్స్’ అనే చిత్రంలో నటించారు. 22 ఏళ్ల క్రితం వచ్చిన ఈ హిట్ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేశారు. మరి ఐశ్వర్యరాయ్ తన పాత కో-స్టార్ కోసం ఈ తమిళ రీమేక్లో నటించడానికి ఒప్పుకుంటారేమో చూడాలి. ఇకపోతే ఈ చిత్రాన్ని ఫెడ్రిక్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత తియగరాజన్ స్వయాన ప్రశాంత్ తండ్రి.