సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీలో ఉన్నారు. కొన్నాళ్లుగా మహేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతుండగా…ఈ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు భారీ విజయం అందుకుంది. దర్శకుడు అనిల్ రావిపూడి పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. సరిలేరు నీకెవ్వరు మూవీ మహేష్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక మహేష్ తన నెక్స్ట్ మూవీపై అధికారిక ప్రకటన చేయలేదు.
ఐతే మహేష్ దర్శకుడు పరుశురామ్ తో మూవీకి పచ్చ జెండా ఊపారు. మహేష్ దీనిపై స్పందించకపోయినా దర్శకుడు పరుశురామ్ స్పష్టత ఇచ్చారు. కాబట్టి వీరి కాంబినేషన్ లో మూవీ లాంఛనమే అని అర్థం అవుతుంది. ఐతే అధికారిక ప్రకటన మాత్రం కృష్ణ గారి పుట్టిన తేదీ అయిన మే 31న రానుంది. దీనితో ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎంటర్టైనర్ సిద్ధం చేశానని పరశురామ్ చెవుతుండగా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.