మన ఇండియన్ ఆడియెన్స్ కి అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ లలో సినిమాలతో పాటుగా క్రికెట్ కూడా ఒకటి. మరి ఈ క్రికెట్ లో ఐపీఎల్ సిరీస్ కి అయితే ఎనలేని క్రేజ్ ఉంది. ఇలా ఈ ఏడాది కూడా జరుగుతున్న ఐపీఎల్ లో మ్యాచ్ లు అన్నీ మంచి రసవత్తరంగా కొనసాగుతుండగా సోషల్ మీడియాలో పలు టీం లు ఇంకా ప్లేయర్స్ కి సంబంధించి ఎప్పటికపుడు ట్రోల్స్ లాంటివి పడుతుంటే ఉంటాయి.
మరి అలాగే రీజనల్ గా కూడా ఆయా రాష్ట్రాలకి చెందిన సినీ ప్రముఖులు తమ అభిమాన జట్లుకి మద్దతు పలుకుతారు. ఇలా లేటెస్ట్ గా హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్ లక్నోలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జయ కేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ బాబు ఒక్కడు సినిమాలో తన చెల్లెలికి లాలీపాప్ ఇచ్చే సన్నివేశంతో ఆర్సీబీ జట్టుపై ఫన్నీ ట్రోల్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో మంచి ఫన్ గా మారిపోయి వైరల్ అవుతుంది. అలాగే పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం అంటూ ఒక్కడు సినిమాలో సాంగ్ లైన్ తోనే మళ్ళీ చివర్లో లాలీపాప్ పెట్టి పోస్ట్ చేయడం గమనార్హం.
Pasidi pathakaala haaram, kaadura vijaya theeram????@IPL #TATAIPL #TATAIPL2025 #SRHvRCB #AMBCinemas pic.twitter.com/Apwq9SoQMR
— AMB Cinemas (@amb_cinemas) May 23, 2025