యాక్షన్ హీరో గోపీచంద్ కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కు 10 లక్షల రూపాయిలు విరాళంగా ఇచ్చారు. అలాగే 1500 మంది సభ్యులతో కూడిన అనాథాశ్రమానికి రెండు నెలల పాటు ప్రతి రోజూ ఆహారాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే గోపీచంద్ 2000 కుటుంబాలకు రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులతో పాటు కిరాణా సామాగ్రిని కూడా పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారితో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో ప్రారంభించిన ఈ కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి ఇప్పటికే స్టార్స్ తో సహా పలువురు ప్రముఖులు కూడా విరాళాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని 24 శాఖల కార్మికుల్లోని పేదలకు సరుకుల్ని పంపిణీ చేస్తున్నారు.
సినీపరిశ్రమలో ప్రతి కార్మికుడికి ఇంటికి నెలకు సరిపడా బియ్యం-పప్పు ఉప్పు గ్రాసరీల్ని అందిస్తున్నారు. ఏమైనా కష్ట సమయంలో ఇలా కార్మికులను ఆదుకుంటున్నందుకు సినీ పెద్దలను అభినందించాలి.