నాగచైతన్య హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా వస్తోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఇప్పటికే 80 % షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి బ్యాలెన్స్ షూటింగ్ రెడీ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు అన్నిటినీ షూట్ చేస్తారట. ఇందుకోసం ఒక విలేజ్ సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే సినిమాని పూర్తి చేయనున్నారు.
ఇక శేఖర్ కమ్ముల ఫిదా లాంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ ఎలాంటి కథతో వస్తాడా అని అందరిలో ఆసక్తి ఉన్న సమయంలో ఆ ఆసక్తిని డబుల్ చేస్తూ ఈ క్రేజీ కాంబినేషన్ తో ఈ సినిమా చేస్తోన్నాడు. కాగా డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను రిలీజ్ చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది.
పైగా శేఖర్ కమ్ముల ఎంచుకున్న కాస్ట్ కూడా ప్రాజెక్ట్ కు పెద్ద ఎస్సెట్ అయింది. ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అయినా తరువాత ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి.