యాక్షన్ హీరో గోపీచంద్ లో హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ సిటీమార్ రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ లాక్ డౌన్ లో సంపత్ నంది స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట.. అలాగే కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారని తెలుస్తోంది. ఆ పాత్రలో వెన్నెల కిశోర్ నటిస్తున్నాడట. సంపత్ నంది సినిమాలో పక్కా కామెడీ అంశాలను హైలెట్ అయ్యే విధంగా సినిమాని ప్లాన్ చేస్తున్నాడట.
ఇక ఈ మూవీలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్కి కోచ్గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్గా చేస్తోంది. కాగా బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో సాగే ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే గోపీచంద్ – సంపత్ నంది కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద చిత్రం పరాజయం అయింది. అందుకే ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి హిట్ ఇవ్వాలని సంపత్ నంది బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి ఈ సారి ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.