సాయి పల్లవి ప్రయాణం ఎక్కడికో..?

టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా విరాట పర్వం మూవీ టీమ్, ఆమెకు విషెశ్ చెబుతూ ఓ పోస్టర్ విడుదల చేశారు. అమరవీరుల స్థూపం దగ్గర లగేజితో ఎదురు చూపులు చూస్తున్న సాయి పల్లవి లుక్ ఆసక్తి రేపుతోంది. ఆమె ఎక్కడికో, ఎవరి కోసమో ప్రయాణం మొదలుపెట్టినట్లుగా ఉంది.అడవి మార్గాన ఉన్న ఆ అమరవీరుల స్తూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుంది? ఎవరి కోసం ఆమె నిరీక్షిస్తోంది? చేతిలోని డైరీలో ఆమె దేని గురించి రాసుకుంటుంది?ఆమె పక్కనున్న బ్యాగ్ లో ఉన్నవేమిటి? ….. ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ విడుదల తర్వాతే. 90ల కాలంలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా సాయి పల్లవి నక్సలైట్ రోల్ చేస్తుందని సమాచారం.

ఇక విరాటపర్వం మూవీలో రానా దగ్గుబాటి హీరోగా చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు ఉడుగుల లవ్ అండ్ రివొల్యూషన్ మిక్స్ చేసే ఓ ఎమోషన్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాల వరకు ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ అనంతరం తాజా షెడ్యూల్ మొదలుకానుంది. మరో హీరోయిన్ ప్రియమణి కూడా ఓ కీలక రోల్ చేస్తున్నారు.

Exit mobile version