గతంలో అనేక టాక్ షోస్తో ప్రేక్షకులను పలకరించిన మంచు లక్ష్మి తనదైన శైలిలో యాంకరింగ్ చేసి బాగానే ఆకట్టుకుంటుంది. కాగా రామ్ గోపాల్ వర్మతో కలిసి 2014 లఘు చిత్రం ‘ఎ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ లక్ష్మి మంచు’ అంటూ ఓ ప్రయత్నం చేశారు. ఇప్పుడు, 6 సంవత్సరాల తరువాత, లక్ష్మి మరియు ఆర్జీవీ ఇద్దరూ జట్టు కట్టబోతున్నారు, కానీ ఈసారి షార్ట్ ఫీల్మ్ కోసం కాదు, ఇన్స్టాగ్రామ్లో లైవ్ సెషన్ కోసం.
ఇన్స్టాగ్రామ్లో లాక్డ్ అప్ విత్ లక్ష్మి మంచు టాక్ షోలో ప్రముఖ అతిథిగా ఆర్జీవీ పాల్గొననున్నాడు. రేపు (మే 4) సాయంత్రం 5:00 గంటలకు లక్ష్మి, ఆర్జీవీ ‘కోరినా వైరస్ మహమ్మారి గురించి.. కరోనా కారణంగా సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుంది ? కరోనా సినిమాల పై ఏ స్థాయిలో ప్రభావం చూపనుంది. థియేటర్స్ కు ప్రజలు మునుపటిలా యధేచ్చగా వస్తారా లాంటి విషయాల గురించి చర్చించనున్నారు.
ఇక మంచు లక్ష్మి పేదవాళ్ళకు సాయం చెయ్యడానికి ఆమె హోస్ట్ చేసిన ‘మేముసైతం’ షో కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి.