శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ధనుష్ – నాగార్జున హీరోలుగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. లేటెస్ట్ గా ఈ సినిమా నైజాం వసూళ్ల సంబంధించిన అఫీషియల్ కలెక్షన్ల డీటెయిల్స్ బయటకు వచ్చాయి. నైజాం ఏరియాలో ‘కుబేర’ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. ఈ చిత్రం నైజాం ప్రాంతంలో మొదటి రోజు రూ. 2.7 కోట్ల (జీఎస్టీ తో సహా) షేర్ ను సాధించింది. రెండవ రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి, రూ. 3.2 కోట్ల ( జీఎస్టీ తో సహా) షేర్ ను రాబట్టింది.
విశేషమేమిటంటే మూడో రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి, కుబేర నిన్న ఆదివారం నాడు రూ. 3.55 కోట్ల ( జీఎస్టీ తో సహా) షేర్ ను రాబట్టింది. మొత్తం మూడు రోజులకు గానూ రూ. 9.5 కోట్లను (జీఎస్టీతో సహా) రాబట్టింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నైజాంలో కుబేరకు మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఈ రోజు సోమవారం కాబట్టి, మరి కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి. ఏదీ ఏమైనా భారీ అంచనాల నడుమ రిలీజ్ ఈ సినిమా సూపర్ టాక్తో దూసుకెళ్తోంది.