క్రిష్ చేతుల మీదుగా “క్షీర సాగర మథనం” టీజర్!!

మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కించిన ఆహ్లాదకర చిత్రం “క్షీర సాగర మథనం”.ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, మరియు “ఓ పిట్ట కథ” చిత్రంలో కనిపించి ఆకట్టుకున్న ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్, హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు.అయితే ‘క్షీరసాగరమథనం’ టీజర్ ను ఈనెల 21న ఉదయం 11 గంటల 11 నిమిషాలకు ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయనున్నారు.

శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రాన్ని ఐదు విభిన్న కథల సమాహారంగా రూపొందిస్తున్నామని. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కొత్త తరహా చిత్రాలను ఆదరించడంలో ఎప్పుడూ ముందుండే మన ప్రేక్షకులు.. “క్షీర సాగర మథనం” చిత్రాన్ని హృదయాలకు హత్తుకుంటారనే నమ్మకం ఉంది. మా చిత్రం టీజర్ సంచలన దర్శకులు క్రిష్ చేతుల మీదుగా విడుదల కానుండడం సంతోషంగా ఉంది” అన్నారు.

ఇక ఈ చిత్రానికి పని చేస్తున్న సాంకేతిక వర్గానికి వస్తే, చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, ఫైట్స్: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్ లు అందిస్తుండగా సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి అందిస్తున్నారు.

Exit mobile version