తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన రీసెంట్ చిత్రం ‘డ్రాగన్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయం సాధించింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కయదు లోహర్ ఒక్కసారిగా అందరి చూపుల్లో పడింది. ఆమె అందంతో పాటు నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.
ప్రస్తుతం చేతిలో మూడు సినిమాలు ఉన్న ఈ బ్యూటీ అనుకోకుండా ఓ స్కామ్లో ఇరుక్కుంది. తమిళనాట ప్రకంపనలు పుట్టిస్తున్న TSMAC స్కామ్లో కయదు లోహర్ కూడా భాగంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ స్కామ్కి సంబంధించిన లేట్ నైట్ పార్టీల్లో పాల్గొనేందుకు కయదు లోహర్కు రూ.35 లక్షలు చెల్లించారనే వార్త వైరల్ అవుతోంది.
దీంతో ఈడీ ఆమెకు ఈ స్కామ్తో ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై ఆరా తీస్తోంది. తక్కువ టైమ్లో లైమ్లైట్లోకి వచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడిలా స్కామ్లో ఇరుక్కోవడం ఏమిటని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.