టాలీవుడ్లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాను హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్గా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా, పూర్తి డివోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
మరికొద్ది గంటల్లో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్కు రెడీ కావడంతో ఈ సినిమాను వీక్షించేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ సినిమా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ రూపంలో బుక్ మై షోలో 24 గంటల్లోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ రేంజ్లో టికెట్ బుకింగ్స్ జరుగుతుండటంతో ఈ మూవీ తొలిరోజే భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
115,000 tickets sold in just 24 hours.
My heart is racing! ????????To witness this kind of pre-release love and anticipation is truly humbling.
I’m deeply grateful to every movie lover for the unwavering support.This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…
— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025