టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన లేటెస్ట్ డివోషనల్ హిట్ చిత్రం “కన్నప్ప”. మంచి అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ మన్ననలు అందుకొని మంచి రన్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం డిప్యూటీ సీఎం సిద్ధం అయ్యారట.
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు కానీ కాదు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కన్నప్ప స్పెషల్ స్క్రీనింగ్ ని చూడనున్నారట. హైదరాబాద్ లో మహేష్ థియేటర్స్ ఏఎంబీ మాల్ లో ఈ సాయంత్రం 7 గంటలకు మోహన్ బాబు, మంచు విష్ణులతో కలిసి ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొననున్నారట. మరి షో అయ్యాక తెలంగాణ ముఖ్యమంత్రి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.