ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా గత ఏడాది ‘దేవర’తో పలకరించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ ఏడాదిలో ‘వార్ 2’తో బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించాడు.
బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తో తారక్ కూడా నటిస్తుండగా నార్త్ లో హృతిక్ మార్కెట్ సినిమాకి భారీగా ప్లస్ అయితే సౌత్ లో మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ర్యాంపేజ్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ వార్ 2 బిజినెస్ లెక్కలు మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే మన తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఏ పాటిదో అందరికీ తెలిసిందే. దీనితో తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ వార్ 2కి జరిగే అవకాశం ఉందట. ఎలా లేదన్నా సుమారు 80 కోట్ల మేర లేదా ఆ పైగానే బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.