మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. కాగా ఈ సినిమాలో రవితేజ డబల్ యాక్షన్ అట. దాంతో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను ఫైనల్ చేసిన చిత్రబృందం, మరో హీరోయిన్ గా నభా నటేష్ ను తీసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ లో నభా, నిధి హీరోయిన్స్ గా నటించారు. మళ్లీ ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఇప్పటికే సగం పైగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని కరోనా తగ్గాక విడుదల చేయాలనుకుంటున్నారు. ఏమైనా రవితేజ ‘డిస్కో రాజా’తో ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయినప్పటికీ సినిమాల స్పీడ్ ను మాత్రం పెంచుతూనే ఉన్నాడు.