పాత పద్దతిలోనే ‘వీరమల్లు’ ట్రైలర్ లాంచ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే క్రిష్ జాగర్లమూడి కలయికలో తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా హిస్టారికల్ చిత్రమే “హరిహర వీరమల్లు”. అయితే ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకొని వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ అనేది ఇపుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.

ఈ మధ్య కాలంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కి మినిమమ్ నెల రోజులు ముందే ట్రైలర్ విడుదల చేసుకొని హైప్ ఎక్కించుకుంటున్నారు. కానీ వీరమల్లు ట్రైలర్ ఇపుడు వారం మేర సమయానికి వచేస్తున్నప్పటికీ ట్రైలర్ ఇంకా రాలేదు. దీనితో ఉన్న హైప్ మరింత కావాలి అంటే ఆ ట్రైలర్ రావడం తప్పనిసరి అని చెప్పక తప్పదు.

మరి ఈ నేపథ్యంలో పాత ట్రెండ్ లోనే ట్రైలర్ వచ్చే ఛాన్స్ ఉందట. అప్పట్లో ఆడియో లాంచ్ లోనే డైరెక్ట్ గా ట్రైలర్ విడుదల చేసుకునేవారు అది నెమ్మదిగా ప్రీరిలీజ్ లోకి వచ్చింది. ఇపుడు ఇదే తరహాలో నేరుగా ప్రీరిలీజ్ రోజే ట్రైలర్ వదిలే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version