టాలీవుడ్ కి దసరా సీజన్ కలిసొస్తుందా ?

టాలీవుడ్ కి దసరా సీజన్ కలిసొస్తుందా ?

Published on Jun 22, 2020 9:45 PM IST

కరోనా మహమ్మారి వల్ల సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయిపోయాయి. అయితే పోస్ట్ ఫోన్ అయిన సినిమాలన్ని విజయదశమి సెలవుల్ని టార్గెట్ చేసుకుని పోటీకి సిద్దమయ్యే అవకాశం ఉందట. దసరాకి భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ప్రధానంగా చిరు ‘ఆచార్య’, రజనీ ‘అన్నాత్తే’, యాష్ ‘కె.జి.ఎఫ్ 2’ అలాగే కంగనా ‘తలైవి’ సినిమాల పై ప్రేక్షకులు బాగా ఆసక్తిగా ఉన్నారు. మొత్తానికి వచ్చే దసరా సీజన్ టాలీవుడ్ కి కీలకంగా మారిపోయింది.

అయితే అక్టోబర్ నాటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గితే దసరాకి చిరంజీవిల ‘ఆచార్య’, రజనీ మూవీ అలాగే ‘కె.జి.ఎఫ్ 2’ భారీ సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక మరో పక్క సమ్మర్ సీజన్ లాగే, దసరా సీజన్ కూడా మిస్ అవుతుందేమో అనే టెన్షన్ కూడా ఉంది. మరి దసరా సీజన్ టాలీవుడ్ కి కలిసొస్తుందా లేదా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు