పాన్ ఇండియా విధ్వంసం బాహుబలి సినిమా కోసం అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా సహా భారతీయ సినిమా తాలూకా రూపు రేఖలు ఈ సినిమా మార్చివేసింది. మొత్తం రెండు భాగాలుగా వచ్చిన ఈ ఫ్రాంచైజ్ రికార్డు వసూళ్లు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు రాజమౌళి ప్రాణం పెట్టి తీసిన ఈ సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ కి రాబోతున్నాయి.
మరి ఈ సినిమా మొదటి పార్ట్ ని అక్టోబర్ లో అనౌన్స్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఇంకొకటి తెలుస్తోంది. మేకర్స్ థియేటర్స్ లో కొత్త ట్రీట్ ని ఇవ్వబోతున్నారట. ఏకకాలంలో పార్ట్ 1 అలాగే పార్ట్ 2 ని కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా సినిమాని ట్రిమ్ చేసి ఒక్క సినిమా గానే మార్చి ఆ వెర్షన్ ని అక్టోబర్ లో విడుదల చేస్తారని టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.