వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తోంది. ‘నీది నాది ఒకే కథ’ అనే చిన్న కథలో కొత్త సంఘర్షణను జోడించి హిట్ ను అందుకున్న ‘వేణు ఉడుగుల’, ఈ సారి కూడా ఈ ‘విరాటపర్వం’ అనే పొలిటికల్ థ్రిల్లర్ లో కొత్త కోణాలను చాలా ఇంట్రస్ట్ గా చూపించబోతున్నాడట. ముఖ్యంగా రానా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని.. సెకెండ్ హాఫ్ కొత్తగా అనిపిస్తోందని.. థ్రిల్లింగ్ అంశాలతో ఓ కొత్త కోణంలో దర్శకుడు కథను చెప్పబోతున్నాడట.
కాగా తెలంగాణ ప్రాంతంలోని 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా పీరియాడిక్ సోషల్ డ్రామాగా ఈ మూవీ రానుంది. ఈ సినిమాను హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా, సాయి పల్లవి జానపద గాయనిగా కనిపించనుంది. అయితే సాయి పల్లవి పై కీలక సన్నివేశాలను ఇప్పటికే షూట్ చేసింది చిత్రబృందం. కానీ, రానాకి సంబంధించిన సీన్స్ షూట్ చేయాల్సి ఉంది. లాక్ డౌన్ అనంతరం షూట్ చేయనున్నారు.