బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు చేస్తున్న భారీ చిత్రం “అఖండ 2 తాండవం” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉండగా ఈ చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కలయికలో మూడోసారి వర్క్ చేయనున్నారు అనే టాక్ కూడా వచ్చింది.

అయితే క్రిష్ తో గౌతమి పుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత హ్యాట్రిక్ సినిమా కోసం రెడి అవుతున్నారట. మరి ఈ సినిమా కోసం బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఇపుడు వరకు ఎన్నో సినిమాలలో డ్యూయల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రెండు పాత్రల్లో అలరించనున్నారట. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Exit mobile version