ఆపరేషన్ సిందూర్: దేశవ్యాప్తంగా ప్రముఖులు సపోర్ట్

గత కొన్ని రోజులు కితమే జరిగిన పహాల్గమ్ ఉగ్రవాద దాడి మన దేశంలో ఎలాంటి విషాదాన్ని నిలిపిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉగ్రవాద దాడుల్లో కేవలం మతపరంగా హత్యలు చేసిన నేపథ్యంలో భారత్ నుంచి గట్టి సమాధానం పాకిస్తాన్ కి తప్పకుండ ఇచ్చి తీరాలి అని యావత్తు దేశం అట్టడుకుంది.

అంతే కాకుండా ఇక్కడే ఉంటూ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్న వారి నిజమైన రంగులు కూడా బయటకి వచ్చాయి. అయితే పహాల్గమ్ ఘటనతో సినీ ప్రముఖులు అనేకమంది దేశ వ్యాప్తంగా కూడా ఖండించారు. ఇక ఇపుడు పాకిస్తాన్ పై ఒక ఆకస్మిక ఆపరేషన్ ఊహించని విధంగా బయటకి వచ్చింది.

భారత ఆర్మీ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఈ తెల్లవారు ఉదయం 1 గంట 44 నిమిషాల సమయంలో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆకస్మిక మెరుపు దాడి చేయడంతో దేశ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ సిందూర్ కోసం సంచలనంగా మారింది. మరి ఈ గట్టి సమాధానంకి ఇండియా వైడ్ గా అనేమంది సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇంకా క్రికెట్ నుంచి సెహ్వాగ్ ఇతర ప్రముఖులు సపోర్ట్ చేస్తున్నారు.

Exit mobile version