మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. ఈ సినిమా మే 30న వేసవి సీజన్లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘భైరవం’ ప్రమోషన్స్లో భాగంగా మనోజ్ తన మనసులోని మాట బయటపెట్టారు. ‘‘నా కుమార్తెను నాన్న ఎత్తుకుంటే చూడాలనుకుంటున్నా’’ అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
మనోజ్ ఇంకా మాట్లాడుతూ.. ‘తాజా పరిణామాల రీత్యా అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. అమ్మను కలవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే నేను వెళ్తే ఆమె ఇంటి బయటకు వచ్చి కలవాలి. ఇలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదు. ఆమె కూడా మమ్మల్ని ఎంతో మిస్ అవుతుంది. నేను ఇప్పటివరకూ ఆస్తి అడగలేదు. అడిగినట్లు నిరూపించమని అడుగుతున్నా. నిందలు వేసి.. వాటిని నిజమని అంగీకరించమంటే నా వల్ల కాదు. వాళ్లు చేసే పనులకు కోపం రావడం లేదు. బాధగా ఉంటుంది. ఇంత జరిగినా వాళ్లను ప్రేమించడం తప్ప ద్వేషించ లేదు’ అని మంచు మనోజ్ ఎమోషనల్ అవుతూ తెలిపారు.