సుశాంత్ సింగ్ ఆత్మ హత్య వలన రగిలిన అశాంతి ఇప్పట్లో చల్లారేలా లేదు. సోషల్ మీడియా వేదికగా ఈ ఉద్యమం ముందుకు వెళుతుంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దర్శక నిర్మాతలు, స్టార్స్ మరియు వారి వారసులను టార్గెట్ చేస్తూ నెటిజెన్స్ నెగెటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. సుశాంత్ లాంటి అనేక మంది స్వశక్తితో ఎదగాలనున్న వారిని నెపోటిజమ్ కారణంగా తొక్కేస్తున్న వైనాన్ని తప్పుబడుతున్నారు.
ఈ పరిణామాలు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను బాగా కలచి వేశాయని తెలుస్తుంది. దీనితో ఆమె ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నెగెటివిటీ ప్రశాంతత లేకుండా చేస్తుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని ఆమె చెప్పారు. సోనాక్షి సిన్హా కూడా వారసత్వం ద్వారా పరిశ్రమకు పరిచమైన వారే. సీనియర్ నటుడు మరియు పొలిటీషియన్ శత్రుజ్ఞ సిన్హా కూతురే సోనాక్షి. ఈమె తల్లి పూనమ్ సిన్హా కూడా నటి కావడం విశేషం.