మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. రంగస్థలం సినిమా తర్వాత చరణ్ నుంచి రాబోతున్న మరో విలేజ్ డ్రామా ఇది కాగా దీని పట్ల మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా మేకర్స్ ప్లాన్ చేస్తుండగా లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ పాటలు ఇంకా స్కోర్ పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తాలూకా మ్యూజికల్ బ్లాస్ట్ కి రంగం సిద్ధం అవుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మేకర్స్ త్వరలోనే సినిమా తాలూకా ఫస్ట్ సింగిల్ ని వదిలే సన్నాహాలు ఆల్రెడీ చేస్తున్నారట. అలాగే ఈ సాంగ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ లపై ఉండొచ్చని టాక్. మరి రెహమాన్ ఈ సాలిడ్ కాంబినేషన్ కోసం ఎలాంటి ట్యూన్ అందించారో వేచి చూడాల్సిందే. క్లిక్ అయితే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో జాతరే అనుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహించగా వచ్చే ఏడాది మార్చ్ 27న రిలీజ్ కి తీసుకొస్తున్నారు.