టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ రెండవ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘గౌరవం’. ఇటీవలే రాజమండ్రి చుట్టూ పక్కల ప్రదేశాల్లో చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ పొల్లాచ్చిలో ప్రారంభమైంది. ఇక్కడ ఈ చిత్రానికి సబందించిన కొంత టాకీ పార్ట్ మరియు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే చివరి షెడ్యూల్ కోసం ఈ చిత్ర టీం కేరళకు బయలుదేరుతుంది. అల్లు శిరీష్ కి జోడీగా ‘నువ్విలా’ చిత్రం ద్వారా తెలుగు వారికి పరిచయమైన యామి గౌతం నటిస్తున్నారు. డ్యూయెట్ మూవీ బ్యానర్ పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆకాశమంత’ మరియు ‘గగనం’ చిత్రాల ద్వారా తెలుగు వారికి సుపరిచితుడైన రాధా మోహన్ ఈ ద్వి భాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాజర్ మరియు ఎల్.బి శ్రీరామ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
పొల్లాచ్చిలో మొదలైన గౌరవం కొత్త షెడ్యూల్
పొల్లాచ్చిలో మొదలైన గౌరవం కొత్త షెడ్యూల్
Published on Oct 2, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- ఇంటర్వ్యూ : హీరో శివకార్తికేయన్ – ‘మదరాసి’ ఆడియన్స్కు డిఫరెంట్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుంది..!
- గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’ ట్రైలర్ రిలీజ్
- టాక్.. ‘పెద్ది’ కూడా గ్లోబల్ లెవెల్ ప్లానింగ్?
- శీలావతి కోసం పుష్పరాజ్… సౌండింగ్ అదిరింది..!
- నైజాంలో ‘రాజా సాబ్’ డీల్ పూర్తి.. రిలీజ్ చేసేది వారేనట!?
- లేటెస్ట్.. ‘కూలీ’ ఓటీటీ డేట్ వచ్చేసింది!
- 300 కోట్ల సినిమా ఉన్నా ‘మదరాసి’ కి చప్పుడే లేదే!
- IPL 2026: ధోని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
- పైడ్ ప్రీమియర్స్ తో ‘లిటిల్ హార్ట్స్’.. మేకర్స్ కాన్ఫిడెన్స్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’లో తన పాత్రపై కుండబద్ధలు కొట్టిన బ్యూటీ..!
- ఆంధ్ర కింగ్ తాలూకా.. బీట్ రెడీ సింగర్ కూడా రెడీ..!
- ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘కన్నప్ప’
- ఓటీటీలో ‘కన్నప్ప’ ట్విస్ట్!
- అల్లరి నరేష్ కొత్త సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్!
- ‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!
- వీడియో : కిష్కింధాపురి ట్రైలర్ (బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్)
- వీడియో : ఘాటీ రిలీజ్ గ్లింప్స్ (అనుష్క శెట్టి)