దక్షిణాదికి చెందిన గాయకులలో ప్రముఖ గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు ఘంటసాల గారు. ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఆపాత మధురాలే. ఆయన ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు రచయితగా గుర్తింపు పొందారు
ఇప్పుడు ఘంటసాల వంశం తరం వారుతెలుగు ఇండస్ట్రీలోకి రానున్నారు. రత్నకుమార్ కూతురైన వీణా ఘంటసాల ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ‘అందాల రాక్షసి’ లో ఒక పాటపాడిన ఈ గాయని ‘హార్ట్ ఎటాక్’ కు డబ్బింగ్ చెప్పింది.
వీణా ఇప్పటికే కొన్ని టి.వి సీరియల్లలో, సినిమాలలో డబ్బింగ్ చెప్పింది. సెగ సినిమాలో బిందు మాధవికి ‘ఉరిమి’లో నిత్యామీనన్ కి గాత్రదానం చేసింది. ఆమె కళామతల్లి ఒడిలో సేదతీరాలని కోరుకుందాం