మెగా హీరోలైన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల మధ్య ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర సంభాషణ నడించింది. గతంలో వరుణ్ మరియు నిహారికల పెళ్లి గురించి నాగబాబు చేసిన కామెంట్స్ వీడియోకి సంబంధించిన థంబ్ నైల్ పోస్ట్ చేస్తూ.. ఏంటి బావ నీకు పెళ్ళంటా? అని ధరమ్ తేజ్, వరుణ్ ని అడిగాడు. దీనికి సమాధానంగా వరుణ్ దానికి ఇంకా చాలా సమయం ఉంది అని సమాధానం చెప్పారు. ఐతే రానా, నితిన్ ఇప్పట్లో పెళ్లి చేసుకోము, మేము ఎప్పుడూ సింగిల్ గ్రూపే అని చెప్పి, గ్రూప్ నుండి బయటికి వెళ్లిపోయారని ఫన్నీ సమాధానం చెప్పారు.
ఇప్పట్లో పెళ్లి లేదని చెప్పిన నితిన్, రానా తమ పెళ్లి ప్రకటన చేసి ఒకవిధంగా మన సింగిల్ గ్రూప్ ని మోసం చేశారు అని ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ఐతే వరుణ్ ట్వీట్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, నాగబాబు చెప్పినట్లు వచ్చే ఏడాది వరుణ్ వివాహం ఉండదు అని. ఇక వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బేస్డ్ మూవీ చేస్తున్నారు. సాయి ధరమ్ సుబ్బు దర్శకుడిగా సోలో బ్రతుకే సో బటర్ అనే మూవీ చేస్తున్నారు.
Dhaaniki chaala time undhi le kaani, Mana @RanaDaggubati and @actor_nithiin maatram Forever with you antune simple ga SINGLE GROUP nunchi Exit aipoyaru..????
— Varun Tej Konidela (@IAmVarunTej) May 23, 2020