ఓటీటీల మధ్య చిచ్చు పెట్టిన ‘విరాటపాలెం’.. జీ5 పై కోర్టుకెక్కిన ఈటీవీ విన్

ఓటీటీల మధ్య చిచ్చు పెట్టిన ‘విరాటపాలెం’.. జీ5 పై కోర్టుకెక్కిన ఈటీవీ విన్

Published on Jun 25, 2025 10:00 PM IST

ప్రస్తుతం ఓటీటీ కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో చాలా మంది మేకర్స్ తమ సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల మధ్య చిచ్చు పెట్టింది.

పోలూరు కృష్ణ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘విరాటపాలెం’. ‘పీసీ మీనా రిపోర్టింగ్’ అనేది ఈ వెబ్ సిరీస్ ట్యాగ్ లైన్. ఈ వెబ్ సిరీస్‌లో అభిజ్ఞ, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్‌ను జీ5లో జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే, ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను ఆపేయాలంటూ ఈటీవీ విన్ కోర్టును ఆశ్రయించింది.

తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రాబోతున్న ‘కానిస్టేబుల్ కనకం’ అనే చిత్ర కథను విరాటపాలెం పోలి ఉండటంతో వారు కేసు నమోదు చేశారు. మరి ఈ ఓటీటీల మధ్య గొడవకు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు