‘ఎమర్జెన్సీ’ పై ‘కంగనా రనౌత్’ కీలక నిర్ణయం

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ స్వీయ దర్శకత్వంలో ‘ఎమర్జెన్సీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు విడుద‌లై మంచి విజయాన్ని అందుకుంది. కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. ఈ క్రమంలో కంగనా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ టికెట్ ను కేవలం రూ.99కు తగ్గించాలని కంగనా నిర్ణయం తీసుకుంది. దీంతో, ఈ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరే అవకాశం ఉంది.

కాగా ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, అధిర్ భట్, విశాఖ్ నాయర్ వంటి నటులు నటించారు. ప్రతి నటుడు ప్రముఖ రాజకీయ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తం ఆధారంగా ఈ మూవీని తీసుకువచ్చారు. ఏది ఏమైనా ఈ మూవీలో కంగనా తన నటనతో అందరినీ నుంచి ప్రశంసలు అందుకుంది.

Exit mobile version