తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పొట్రు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సూర్య ఇంకొన్ని కొత్త చిత్రాలకు కమిటవుతున్నారు. వాటిలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ చిత్రం కూడా ఉండనుంది. ఇదివరకే గౌతమ్ మీనన్, సూర్యల కాంబో గురించి వార్తలు వచ్చినా ఎక్కడా కన్ఫర్మేషన్ అందలేదు. దీంతో ప్రాజెక్ట్ ఉంటుందో లేదో అనుకున్నారు అందరూ. కానీ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. లాక్ డౌన్ పూర్తయ్యాక గౌతమ్ మీనన్ సూర్యకు కథ వినిపించనున్నారట.
కాగా తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం గౌతమ్ మీనన్ రాసుకున్న కథ సస్పెన్స్ థ్రిల్లర్ అని.. ప్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ స్టోరీలో ఎమోషన్స్ కూడా చాలా బాగుంటాయని తమిళ్ మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగూ గౌతమ్ మీనన్ డైరెక్షన్ అంటే ఏంతో ఇష్టపడే సూర్య తప్పకుండా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక గౌతమ్ మీనన్ గతంలో సూర్యతో కలిసి ‘కాఖ కాఖ, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలు చేశారు. అందుకే వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకులకు విపరీతమైన ఆసక్తి ఉంది.