మరో కాంపౌండ్ లోకి చేరిన ‘మహా సముద్రం’ !

మరో కాంపౌండ్ లోకి చేరిన ‘మహా సముద్రం’ !

Published on Apr 2, 2020 11:30 PM IST

దర్శకుడు అజ‌య్ భూప‌తి “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం మాత్రం బాగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.. ఇప్పటికే అజ‌య్ భూప‌తి సినిమా నుండి మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. అజేయ్, హీరో శర్వానంద్ తో ముందుకు వెళ్తున్నాడు. అలాగే మరో హీరో కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చిందని తెలుస్తోంది. కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు.

కాగా ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘మహా సముద్రం’ అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు