ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నిజామాబాద్ లోని తన స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు మరియు అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. కాగా ‘దిల్’ రాజు, తేజస్విని (వైఘారెడ్డి)ని వివాహం చేసుకున్నారు. ఇక దిల్ రాజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
కాగా నిర్మాతగా తిరుగు లేని విజయాలను అందుకుంటూ టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా ‘దిల్ రాజు’ కొనసాగుతున్నారు. కాగా మూడేళ్ళ క్రితం దిల్ రాజు భార్య అనిత అనారోగ్యం కారణంగా మరణించడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. దీంతో మరో పెళ్లి చేసుకోమని కుటుంబ సంభ్యులు, సన్నిహితులు ఎప్పటినుండో కోరుతూ ఉండటంతో దిల్ రాజు రెండో వివాహానికి అంగీకరించారు.