ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెలుగులో మూడు సినిమాల వరకు రూపొందుతున్నాయి. నాని హీరోగా దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కగా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిపడింది. అలాగే పవన్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ సైతం దిల్ రాజు నిర్మాణంలో రూపొందినదే. ఈ సినిమా షూటింగ్ సైతం చివరి దశకు చేరుకుంది. వీటితో పాటు దర్శకుడు వినాయక్ హీరోగా శీనయ్య అనే సినిమా తెరకెక్కిస్తున్నారు.
అలాగే దిల్ రాజు దగ్గర ఓ భారీ పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ఉందిట. ఆ స్క్రిప్ట్ సిద్ధం చేసింది దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కాగా, ఆయనే దర్శకత్వం వహించనున్నారట. పాన్ ఇండియా సబ్జెట్ కావడంతో ఓ స్టార్ హీరో కోసం వారు ఎదురు చూస్తున్నారట.దానితో పాటు ప్రస్తుతం ఆయన నిర్మించిన చిత్రాల విడుదల తరువాత ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తారట. మరి దిల్ రాజ్ పాన్ ఇండియా ఎంట్రీ, ఏ హీరోతో అవుతుందో. ఐతే ఈ స్క్రిప్ట్ ప్రభాస్ వద్దనుకున్నదని కూడా టాక్.