టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ ని గౌరవించిట్లేదా ?

టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ ని గౌరవించిట్లేదా ?

Published on May 4, 2020 10:11 PM IST

డైరెక్టర్ అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన మొట్టమొదటి డైరెక్టర్ ‘దిగ్దర్శకుడు, దర్శకరత్న డా. దాసరి నారాయణరావు’. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన ఆ దిగ్దర్శకుడి జయంతి నేడు. 1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించిన దాసరి అత్యధిక చిత్రాల చేసిన దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు.

మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్న గొప్పవారు దాసరి. 2017 మే 30న మనకు భౌతికంగా దూరమయినా ఆయన తీసిన అజరామ సినిమాలు మన తెలుగు సినీ రంగానికి అపురూపం తతరాలుకు తరగని గనిభాండారం.

దాసరి నారాయణరావు దర్శకునిగా పరిచయమైంది 1972లో ‘తాతమనవడు’తో. ఆ సినిమా ఇప్పుడు చూసినా మనసును కదిలిస్తోంది. ఇక సినీ కార్మికుల పక్షాన నిలిచిన ఆయన వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయారు. అయితే ఆ దిగ్దర్శకుడికి తెలుగు సినీపరిశ్రమ సరైన గౌరవాన్ని ఇస్తోందా… నేడు ఆయన జయంతి.

కానీ ఇప్పటివరకూ సినీ పెద్దలలో చాలా మంది దర్శకరత్న జయంతి గురించి ఇంకా స్పందించలేదు. ఆయన మరణించిన సమయంలో కూడా కొంతమంది పెద్దలు ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి కూడా రాలేదని ఓ విమర్శ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు