తమిళ నటుడు ధనుష్ ప్రస్తుతం తండ్రిగా చాలా గర్వంగా ఉందని పేర్కొంటున్నాడు. ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్తో ధనుష్కి కలిగిన సంతానం యాత్ర. ఇప్పుడు తమ పుత్రుడు యాత్ర డిగ్రీ పట్టా పుచ్చుకున్నట్లు ధనుష్ పేర్కొన్నాడు.
తమ కొడుకు సాధించిన ఈ విజయాన్ని చూసి తల్లిదండ్రులుగా తమ మనసు ఉప్పొంగిపోతుందని వారు కామెంట్ చేస్తున్నారు. ఈ మేరకు యాత్ర గ్రాడ్యుయేషన్ కాన్వొకేషన్లో ధనుష్తో పాటు ఐశ్వర్య కూడా పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ధనుష్ తన ఇన్స్టో అకౌంట్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.