మళ్ళీ సాహో సీన్ రిపీట్ అయ్యిందా?

మళ్ళీ సాహో సీన్ రిపీట్ అయ్యిందా?

Published on Mar 16, 2020 8:29 AM IST

ప్రభాస్ నుండి గత ఏడాది సాహో అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రావడం జరిగింది. ఆ చిత్రం ప్రభాస్ కి మిశ్రమ ఫలితాలు అందించింది. ఐతే ఈ మూవీ మ్యూజిక్ విషయంలో చిన్న వివాదం నడిచింది. సాహో మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఉన్న శంకర్, ఎహసాన్, లాయ్ లు మధ్యలో సినిమా వదిలేసి వెళ్లిపోయారు. సాహో నిర్మాతలు పూర్తి పాటలు కంఫోజ్ చేసే బాధ్యత వారికి ఇవ్వకపోవడంతో ఆ మ్యూజిక్ త్రయం ఈ నిర్ణయం తీసుకొని వెళ్లిపోవడం జరిగింది.

ఇక ప్రభాస్ లేటెస్ట్ మూవీ విషయంలో కూడా ఇదే జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రాధా కృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా అమిత్ త్రివేది ఎంపికయ్యారు. కారణం ఏమిటో గాని ఈ మూవీ నుండి ఆయన తప్పుకున్నారట. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.

తాజా వార్తలు