నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ను త్వరలోనే జార్జియాలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ షెడ్యూల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఓ బాలీవుడ్ నటుడు ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఆ నటుడు సన్నీ డియోల్ అని రూమర్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నీ డియోల్ క్యారెక్టర్ ద్వారా.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఓ భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందట.
ఈ ట్విస్ట్ ‘ అఖండ 3’ కి లీడ్ అవుతుందని తెలుస్తోంది. మరీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ వార్త మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. కాగా ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.