ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రానున్న భారీ చిత్రాల్లో దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత మరో టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కలయికలో సాలిడ్ ప్రాజెక్ట్ ని విజయ్ చేయనున్నాడు. ఆల్రెడీ ట్యాక్సీవాలా చేసిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.
ఇక ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కన్ఫర్మ్ అయ్యింది. దర్శకుడు అలాగే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి లేటెస్ట్ హింట్స్ తో ఇది కన్ఫర్మ్ అయ్యింది. ఇక అధికారిక ప్రకటన ఒక్కటి మాత్రం బాకీ అని చెప్పాలి.
#HmmLetsSee @iamRashmika ????
— Mythri Movie Makers (@MythriOfficial) May 2, 2025