టాలీవుడ్లో కమెడియన్గా తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు దర్శకుడిగా మారి తమ ప్రతిభను చాటారు. వారిలో ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి తదితరులు ఉన్నారు. వీరు తెరకెక్కించిన సినిమాలు ప్రేక్షకులను రంజింపజేశాయి. ఇక ప్రస్తుతం కమెడియన్స్గా ఉంటూనే దర్శకుడిగా మారిన వారిలో ‘బలగం’ వేణు సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
అయితే, ఇప్పుడు వీరి బాటలోనే మరో తెలుగు కమెడియన్ దర్శకుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడట. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో ఫ్రెండ్గా నటించిన రాహుల్ రామకృష్ణ, ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన కూడా దర్శకుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడట.
తన సినిమాలో నటించేందుకు కొత్త నటీనటులు కావాలంటూ ఆయన ఇటీవల ఓ ప్రకటన చేశారు. దీంతో రాహుల్ ఎలాంటి సినిమాను డైరెక్ట్ చేస్తాడా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది. మరి మిగతా వారిలా రాహుల్ కూడా దర్శకుడిగా సక్సెస్ అందుకుంటాడా అనేది వేచి చూడాలి.