పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హారర్-కామెడీ జోనర్లో ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
రాజాసాబ్ షూటింగ్ తాము ప్లాన్ చేసినట్లుగానే శరవేగంగా పూర్తవుతుందని.. ఇప్పటికే ఈ చిత్రం 95 శాతం షూటింగ్ పూర్తయిందని.. మరో మూడు సాంగ్స్, కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉన్నాయని వారు తెలిపారు. షూటింగ్ ముగియగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అంతే వేగంగా ముగిస్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ రెండు వైవిధ్యమైన గెటప్స్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.