తెలుగు రాష్ట్రాలకు చెందిన మూవీ ఎగ్జిబిటర్లు తాజాగా సమావేశం అయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 65 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. వారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
సినీ పరిశ్రమలో ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని వారు తేల్చి చెప్పారు. అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన ద్వారా తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని థియేటర్ల ఓనర్లు తెలిపారు. తమ నిర్ణయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ గిల్డ్కు తెలియజేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ పేర్కొంది. ప్రొడ్యూసర్లు తమ నిర్ణయాన్ని గౌరవించి, తమకు సహకరించకపోతే జూన్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు బంద్ చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు.