మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుండి ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. కాగా తాజాగా మెగాస్టార్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. మెగాస్టార్ పోస్ట్ చేస్తూ.. ‘సాధారణంగా, నేను సాంగ్స్ షూట్ చేసినప్పుడే వింటూ ఆ సాంగ్ ను పూర్తిగా ఆనందిస్తాను, మధ్యలో పాజ్ చేయడం లాంటివి ఇష్టపడను. కానీ ఇటీవలే, నేను ఒక పాటను మాత్రం పాజ్ చేస్తూ… మళ్లీ ఫస్ట్ నుండి పెట్టుకుంటూ ఆ సాంగ్ ను మళ్ళీ మళ్లీ ఎంజాయ్ చేస్తున్నాను. దీనికి కారణం.. రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను’. అంటూ ట్వీట్ చేశారు.
మరి ఆ సాంగ్ గురించి తెలియాలంటే మెగా అభిమానులు రేపు ఉదయం వరకు ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా వస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా మెగాస్టార్తో ఆడిపాడింది. ఇప్పటికే ఆ పాటను షూట్ చేశారు. పాట చాల బాగా వచ్చిందట. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Usually, when we shoot songs, I thoroughly enjoy listening to them and wouldn't like interruptions. But recently, I have been enjoying pausing and resuming a song over and again. కారణం … …? …tomorrow morning 9.00 am
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 27, 2020