గత రెండు నెలలుగా కరోనా వైరస్ పై వైద్య మరియు పారిశుధ్య సిబ్బంది యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికుల సేవకు గురుతుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా పూల వాన కురిపించారు. ప్రధాని మోడీ సూచనల మేరకు దేశంలో అనేక చోట్ల ఇలా చేయడం జరిగింది.
కాగా ఈ కార్యక్రమాన్ని హీరో చిరంజీవి అభినందించారు. వైద్య మరియు పారిశుధ్య సిబ్బంది సేవలకు మనం ఇచ్చే నిజమైన గౌరవం ఇదే అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారు నిజమైన హీరోలంటూ కొనియాడారు. ఇక చిరంజీవి సినీ కార్మికుల శ్రేయస్సు కోసం కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి నిధులు సేకరించి పేద సినీ కార్మికులను ఆదుకోవడం జరిగింది.
సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న frontline warriors కి పుష్పాభివందనం చేయటం అభినందనీయం.We are indebted to you both!Jai Hind! #TrueHeroes pic.twitter.com/cFZ1dTg2GT
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 3, 2020