వారికి మనం రుణపడి ఉన్నాం- చిరంజీవి

వారికి మనం రుణపడి ఉన్నాం- చిరంజీవి

Published on May 3, 2020 9:14 PM IST


గత రెండు నెలలుగా కరోనా వైరస్ పై వైద్య మరియు పారిశుధ్య సిబ్బంది యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడిన రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికుల సేవకు గురుతుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా పూల వాన కురిపించారు. ప్రధాని మోడీ సూచనల మేరకు దేశంలో అనేక చోట్ల ఇలా చేయడం జరిగింది.

కాగా ఈ కార్యక్రమాన్ని హీరో చిరంజీవి అభినందించారు. వైద్య మరియు పారిశుధ్య సిబ్బంది సేవలకు మనం ఇచ్చే నిజమైన గౌరవం ఇదే అని ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారు నిజమైన హీరోలంటూ కొనియాడారు. ఇక చిరంజీవి సినీ కార్మికుల శ్రేయస్సు కోసం కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి నిధులు సేకరించి పేద సినీ కార్మికులను ఆదుకోవడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు