టాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ కు నిర్మాతల మండలికి మధ్య విభేదాలు తలెత్తడంతో సినిమా కార్మికులు స్ట్రైక్ పాటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఇప్పటికే ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. కార్మికుల వేతనాలు పెంపుదలపై నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఛాంబర్ పేర్కొంది.
అయితే, ఇటీవల కొందరు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో భేటి అయ్యారు. ఈ సమస్య గురించి కొద్ది రోజుల్లో పరిష్కారం అయ్యేలా ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. కాగా, ఇప్పుడు కొందరు వ్యక్తులు తాము ఫిలిం ఫెడరేషన్ సభ్యులమని.. చిరంజీవితో భేటి అయ్యామని.. ఆయన తమ వేతనాలు 30 శాతం పెంచేందుకు అంగీకరించారని ప్రచారం చేస్తున్నారట. ఈ విషయం చిరు వరకు వెళ్లింది.
దీంతో ఆయన తాజాగా ఈ విషయంపై స్పందించారు. తన వద్దకు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు ఎవరూ రాలేదని.. తాను ఎవరితోనూ భేటి కాలేదని.. సినిమా కార్మికుల వేతనాల పెంపుపై తాను ఒక్కడినే నిర్ణయం ఎలా తీసుకోగలనని.. ఫిలిం ఛాంబర్ చేతిలోనే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. అంతవరకు అందరూ సంయమనం పాటించాలని.. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దని తాను కోరుతున్నట్లు చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
It has come to my attention that some individuals claiming to be the members of the Film Federation have gone to media falsely claiming that I have met them and given an assurance that their demands regarding 30% wage hike etc., shall be met and that I will be starting shooting…
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 9, 2025