టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘కన్నప్ప’ కూడా ఒకటి. విష్ణు మంచు నటిస్తున్న ఈ హిస్టారికల్ ఎపిక్ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది.
అయితే, ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సినీ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ రన్టైమ్పై ఓ కొత్త వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా రన్టైమ్ ఏకంగా మూడు గంటలకు పైగా ఉండబోతుందని.. ఓ మైథలాజికల్ కథకు ఇంత రన్టైమ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే సందేహం సినీ సర్కిల్స్లో నెలకొంది.
మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో.. నిజంగానే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత లెంగ్తీ రన్టైమ్ ఉంటుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.