పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో త్వరలోనే ‘స్పిరిట్’ చిత్రం ప్రారంభం కానుంది. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ మూవీపై అంచనాలు పీక్స్లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి వార్త వచ్చినా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఈ సినిమాను పూర్తి కాప్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నాడు. కాగా, ఇప్పుడు ఈ సినిమాను ఒకటి కాదు రెండు భాగాలుగా రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్టుకు అనుకూలంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుందని సినీ సర్కిల్స్ టాక్.
కాగా, సందీప్ రెడ్డి వంగా లాస్ట్ మూవీ ‘యానిమల్’ కూడా రెండు భాగాలుగా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఇదే స్ట్రాటెజీ ‘స్పిరిట్’ కోసం కూడా వాడనున్నారట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో వేచి చూడాలి.